ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. అబ్దుల్ సలీం అలియాస్ సుఖ్వా అనే యువకుడిని కొంత మంది దుండగులు కర్రలతో కొట్టి చంపారు. కొంతకాలంగా వీరి మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో దుండగులు కర్రలతో ఇంట్లోకి ప్రవేశించి యువకుడిపై విచక్షణరహితంగా దాడి చేశారు. దాడి దృశ్యాలు అక్కడున్న సీసీఫుటేజీలో రికార్డు కాగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.