కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇల్లందు బయ్యారం చెందిన ధనలక్ష్మి (30)కి పదేళ్ల క్రితం మండలంలోని నెహ్రూనగర్కు చెందిన వెంకటేష్తో ప్రేమ వివాహం జరిగింది. వీరికి కొంతకాలంగా మధ్య కలహాలు నెలకొన్నాయి. మనస్తాపానికి గురైన ధనలక్ష్మి ఆగస్టు 27న గడ్డిమందు తాగారు. దీంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్య తెలిపారు.