ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు.