గాయపడిన వ్యక్తికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసరాలు పంపిణీ

882பார்த்தது
గాయపడిన వ్యక్తికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసరాలు పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం లో భగత్ సింగ్ నగర్ కు చెందిన తాళ్ల శ్రీను పెయింటింగ్ వర్క్ చేస్తున్న సమయంలో బిల్డింగ్ పైనుంచి జారి పడడంతో ఎడమ చేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా మరియు మండల నాయకులు తాళ్ల శ్రీను పరామర్శించారు. తాళ్ల శ్రీను కు సర్జరీ కోసం సుమారు లక్ష రూపాయల ఖర్చు అయినట్లు తెలిపారు. ఈ క్రమంలో మండలంలో ఉన్న జిల్లా మరియు మండల నాయకులు కార్యకర్తల సహకారంతో మండల అధ్యక్షుడు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో గురువారం నిత్యవసరాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గొల్ల వీరభద్రo, గరిక రాంబాబు, తాటికొండ ప్రవీణ్, సాయి, అలుగుల శ్రావణ్, బొక్క వెంకటేశ్వర్లు, మోటా సుధాకర్, డాక్టర్ రఫీ పాషా తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி