తెలుగు సాహిత్యాన్ని ముందు తరాలకు అందించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో తెలంగాణ సాహిత్య పరిషత్(హైదరా బాద్) ఆధ్వర్యంలో జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథావిష్కరణ మంగళవారం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా చరిత్రను పరిషత్కు చెందిన 40 మంది రచయితలు గ్రంథస్థం చేసి భావితరాలకు అందించడం అభినందనీయమన్నారు.