ధ్రువపత్రాల జారీ నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: సబ్ కలెక్టర్

61பார்த்தது
ధ్రువపత్రాల జారీ నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: సబ్ కలెక్టర్
వివిధ ధ్రువపత్రాల కొరకు చేసుకున్న దరఖాస్తులను నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణీత గడువులోగా ధృవపత్రాలను జారీ చేయాలని కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా అన్నారు. బుధవారం కౌటాల మండలంలోని తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, రిజిస్టర్లు, భవనం పరిసరాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో అందిన దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி