పేకాట స్థావరాలపై దాడులు.. ఎనిమిది మందిపై కేసు

73பார்த்தது
పేకాట స్థావరాలపై దాడులు.. ఎనిమిది మందిపై కేసు
పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, వైరా పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఎనిమిది మందిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వైరా మండలంలోని తాటిపూడి-సోమవరం మధ్య మామిడి తోటలో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్, వైరా ఎస్ఐ ఏ. వంశీకృష్ణ భాగ్యరాజ్ ఆధ్వర్యాన తనిఖీలు చేపట్టారు. 8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి రూ. 70 వేల నగదును స్వాధీనం చేసుకోవడమేకాక కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி