బైక్ ను ఢీకొన్న బస్సు.. యువకుడు మృతి

81பார்த்தது
బైక్ ను ఢీకొన్న బస్సు.. యువకుడు మృతి
ఖమ్మం జిల్లా సత్తుపల్లి- కిష్టారం వై-జంక్షన్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చెరుకుపల్లికి చెందిన రామ్(25) ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపు వెళ్తుండగా, ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోతుండగా బస్సు బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி