సాగర్ జలాలను తక్షణమే విడుదల చేయాలి

84பார்த்தது
సాగర్ జలాలను తక్షణమే విడుదల చేయాలి
సాగర్ జలాలను తక్షణమే విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ మేరకు స్థానిక ఐబీ డీఈ శ్రీనివాసరావుకు శుక్రవారం వినతి పత్రం అందించారు. ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరి ప్రస్తుతం పొట్ట దశలో ఉందని, సాగునీరు లేక ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. వరితో పాటు మిర్చి, పత్తి, ఇతర పంటలకు నీరు లేకపోవడంతో ఎండిపోతున్నాయని, వెంటనే విడుదల చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி