సత్తుపల్లి మండలంలో రేపు ఎమ్మెల్యే పర్యటన

76பார்த்தது
సత్తుపల్లి మండలంలో రేపు ఎమ్మెల్యే పర్యటన
ఎమ్మెల్యే మట్ట రాగమయి మంగళవారం సత్తుపల్లి మండలంలో పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ విషయాన్ని అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలన్నారు.

தொடர்புடைய செய்தி