ఎండిన పొలాలు వద్ద రైతుల నిరసన

64பார்த்தது
సాగు నీటిని వెంటనే అందించకుంటే వరి పంటను వదులుకోవాల్సిందేనని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నేలకొండపల్లి మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో ఎండిన వరి పొలాల వద్ద పాలేరు పాత కాల్వ ఆయకట్టు రైతులు నిరసన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి వరి పంటలు సాగు చేశామని, తీరా బిర్రు పొట్ట దశలో ఉంటే నీరు అందట్లేదని, అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி