ముసాయిదా ఓటరు జాబిత సవరణపై ఇంటింటి సర్వేను వేగవంతం చేయాలని డిప్యూటీ కలెక్టర్ ప్రసూనాంబ శనివారం అన్నారు. ఆర్డీఓ గణేష్, నాయబ్ తహసీల్దార్ సురేష్ తో కలిసి ఆమె మధిరలోని గవర్నమెంట్ హై స్కూల్, సిరిపురం స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం స్థానిక బూత్ లెవల్ అధికారులతో సమావేశమై సలహాలు, సూచనలు చేశారు.