పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం ప్రసంగించారు. జమ్మూకశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈసారి కశ్మీర్ లోయలో మార్పు కన్పించిందని రాష్ట్రపతి అన్నారు. శత్రువుల కుట్రలకు అక్కడ ప్రజలు గట్టిగా బదులిచ్చారని అన్నారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొనడం విశేషం అని రాష్ట్రపతి తెలిపారు.