జిల్లాలో వరదల నేపథ్యంలో చెరువులు, కుంటలు ఇతర నీటి వనరులలో నీటి నిర్వహణ నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ లో వరదలు, నీటి వనరుల నిర్వహణపై అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యాంప్రసాద్ లాల్ లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి బి. గంగయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఆశా లత పాల్గొన్నారు.