ఎమ్మెల్యేకు ఏఈఓల వినతి

68பார்த்தது
ఎమ్మెల్యేకు ఏఈఓల వినతి
డిజిటల్ క్రాప్ సర్వే నిరసిస్తూ ఏఈఓలు గురువారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావును కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వే క్షేత్ర స్థాయిలో సహాయకులు లేకుండా కేవలం ఏఈఓలు చేయడం సాధ్యం కాదని వివరించారు. 5 రోజులుగా డిసీఎస్ తప్ప మిగతా విధులన్నీ నిర్వహిస్తున్నా జిల్లా అధికారులు గైర్హాజరు వేస్తున్నారని వాపోయారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி