తిమ్మాపూర్ మండలం రేణికుంట, నుస్తులాపూర్ గ్రామాలలోని రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం అందజేశారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీపీవో జగదీశ్వర్, అధికారులు, కాంగ్రెస్ నేతలు, తదితరులున్నారు.