రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా కొనసాగించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో రాబోయే యాసంగి 2024-25 వరిధాన్యం కొనుగోలు సంబంధించిన సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, వివిధ జిల్లా స్థాయి శాఖాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.