అమెరికాలో గత ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ముక్క నివేష్ (20) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ఆదివారం జరిగాయి. ప్రమాదం జరిగిన వారం రోజులకు ఆదివారం నివేష్ మృతదేహం హుజురాబాద్ కు చేరుకుంది. హుజురాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్క నవీన్ డాక్టర్ ముక్క స్వాతి దంపతుల కుమారుడైన నివేష్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో చదువుతున్నాడు.