వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన కొత్తపల్లి నవీన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లి నవీన్ కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.