జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిలో బీఆర్ఎస్ నేతల నిరసన

64பார்த்தது
జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి పూడూరు వద్ద రైతులతో కలిసి బుదవారం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ధర్నాలో భాగంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకొని ధర్నాను విరమింప చేశారు.

தொடர்புடைய செய்தி