కామారెడ్డి పట్టణం దేవునిపల్లి గ్రామంలోని స్వప్నలోక్ కాలనీలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జండా ఎగరవేసి జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. స్వప్నలోక్ కార్యసాధక శ్రీ అభయాంజనేయ స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, సింధూర పూజలతో ఘనంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. జై హనుమాన్ జై హనుమాన్, రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ భక్తులు నామజపం చేశారు. అనంతరం కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.