బాన్సువాడ పట్టణంలో ద్విచక్ర వాహనం చోరీ

59பார்த்தது
బాన్సువాడ పట్టణంలో ద్విచక్ర వాహనం చోరీ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఓ ద్విచక్ర వాహనం చోరీ జరిగింది. సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చైతన్య కాలనీకి చెందిన ప్రవీణ్ కుమార్ తన ద్విచక్ర వాహనాన్ని రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేశాడు. సోమవారం ఉదయం చూసేసరికి వాహనం కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా లభించలేదు. దీంతో బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி