ఈ నెల 26న పౌరాదేవికి ప్రధాని నరేంద్ర మోదీ రాక

64பார்த்தது
ఈ నెల 26న పౌరాదేవికి ప్రధాని నరేంద్ర మోదీ రాక
బంజారాల ఆరాధ్య దైవస్థానం బంజారా కాశి అయిన పౌరాదేవీకి ఈ నెల 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోది వస్తున్నట్టు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం బాన్సువాడ మండల అధ్యక్షులు రాము రాథోడ్ బుధవారం తెలిపారు. మధ్యాహ్నం 2 గ. లకు రానున్న ప్రధాని పౌరాదేవీ లో నిర్మించిన నంగారా భవన్, ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి బంజారా సోదరులు హాజరు కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி