బాన్సువాడలో రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చివేత

77பார்த்தது
బాన్సువాడలో రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చివేత
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతలను బుధవారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో అధికారులు పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ హకీమ్ నాయకులు ఎజాజ్, కిరణ్, నార్ల ఉదయ్, రమేష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி