ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

64பார்த்தது
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో మంగళవారం సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. బ్యాంకులో అందించే సేవలు, సైబర్ నేరాలు, ఏటీఎం ఉపయోగాలు, డిజిటల్ పేమెంట్స్, బీమా పథకాలు, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్, బాలకృష్ణ, పర్వయ్య, అనుదీప్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி