జేసీబీ సహాయంతో వాగు దాటుతున్న హరిహర నగర్ వాసులు

57பார்த்தது
కురిసిన భారీ వర్షం కారణంగా జగిత్యాల పట్టణంలోని శుక్రవారం ఉదయం పలు వీధులు జలమయం అయ్యాయి. గోవిందు పల్లెలోని వెంకటాద్రి నగర్ బ్రిడ్జి నీట మునిగింది. వరద నీరు బ్రిడ్జ్ పై నుండి ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో వెంకటాద్రి నగర్, హరిహర నగర్ ప్రజలు దిగ్బంధంలో ఉండిపోయారు. నిత్యావసరాల కొరకు ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎమర్జెన్సీ అవసరాల దృష్ట్యా బయటకు వెళ్లాల్సిన వారిని జేసీబీ సహాయంతో బ్రిడ్జి దాటిస్తున్నారు.

தொடர்புடைய செய்தி