తార్నాక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన డిప్యూటి మేయర్

76பார்த்தது
డెంగ్యూ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. మంగళవారం తార్నాకలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దోమలు వృద్ధి చెందకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி