నిజాంపేట్ ప్రగతినగర్ 3వ వార్డు శిల్ప ప్యారడైజ్ కాలనీలో నిన్న అర్ధరాత్రి సుమారు 1: 20 గంటలకు అలీప్ రెండవ గేటు వద్ద గల కిరాణా షాపులో చోరీ జరిగింది. అర్ధరాత్రి దొంగ షట్టర్ తాళం పగులగొట్టి షాపులోని 70 వేల నగదు, సామాగ్రిని ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం యజమాని దుకాణం తెరిచేందుకు వెళ్లగా షట్టర్ తొలగించి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం జరిగింది.