గురు పౌర్ణమి పర్వదినం సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి నిజాంపేట్లోని శ్రీ సాయిబాబా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు సాయి బాబా చిత్రపటాన్నీ హన్మంత్ రెడ్డికి అందచేశారు.