మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం
కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో
కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదనే కారణంతో మైనంపల్లి హనుమంత రావు ఇటీవల బీఆర్ఎస్ ను వీడిన సంగతి తెలిసిందే.