తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పందించారు. 'తెలంగాణ ఎన్నికల్లో
టీడీపీ పోటీ చేస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎల్లుండి చంద్రబాబును కలిసి ఎన్నికల్లో పోటీ చేసే విషయం, ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశాలపై చర్చిస్తాం' అని కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు.