నాభిశిల ప్రతిష్టాపన వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

81பார்த்தது
మక్తల్ పట్టణంలో శనివారం నిర్వహించిన నాభిశిల ప్రతిష్టాపన వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పడమటి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி