విషాదం.. ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు మృతి

69பார்த்தது
విషాదం.. ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు మృతి
గుజరాత్‌లో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. కచ్ఛ్‌లోని ఆగ్రోటెక్ కంపెనీలో బురద ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఒకరు అపస్మారక స్థితిలో పడిపోయినప్పుడు.. అతనిని కాపాడటానికి మరో ఇద్దరు దిగారు. అనంతరం వారు కూడా స్పృహతప్పి పడిపోయారు. కొంచెం సేపటికి మరో ఇద్దరు వ్యక్తులు ట్యాంక్‌లోకి ప్రవేశించారు. దీంతో ఐదుగురు ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు వదిలారు.

தொடர்புடைய செய்தி