డ్రగ్స్‌ కలకలం.. రూ.5 వేల కోట్ల మాదకద్రవ్యాలు స్వాధీనం

78பார்த்தது
డ్రగ్స్‌ కలకలం.. రూ.5 వేల కోట్ల మాదకద్రవ్యాలు స్వాధీనం
గుజరాత్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. దాదాపు 518 కిలోల కొకైన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌తో దీని విలువ రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఢిల్లీ, గుజరాత్‌లకు చెందిన పోలీసులు అంకలేశ్వర్‌లోని ఓ కంపెనీలో తనిఖీలు నిర్వహించగా.. ఈ మేరకు భారీ స్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలోని రూ.2 వేల కోట్ల చొప్పున విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி