బిస్కెట్ తయారీ మెషీన్‌లో పడి తల్లి కళ్ల ముందే బాలుడు మృతి

585பார்த்தது
బిస్కెట్ తయారీ మెషీన్‌లో పడి తల్లి కళ్ల ముందే బాలుడు మృతి
మహారాష్ట్రలోని థానే జిల్లాలో మంగళవారం విషాద ఘటన జరిగింది. ఆనంద్ నగర్ సమీపంలోని అంబర్‌నాథ్ ప్రాంతంలో పూజా కుమారి అనే మహిళ నివసిస్తోంది. బిస్కెట్ కంపెనీలో కార్మికులకు ఆమె లంచ్ బాక్స్‌లు సరఫరా చేస్తుంటుంది. పనికి వెళ్తూ మూడేళ్ల కుమారుడు ఆయుష్‌ చౌహాన్‌ను వెంట తీసుకెళ్లింది. అక్కడ మెషీన్‌లో బిస్కెట్లను ఆయుష్ చూశాడు. వాటిని తీసుకోబోయి మెషీన్‌లో పడిపోయాడు. తల్లి కళ్ల ముందే ఆ బాలుడు చనిపోయాడు.

தொடர்புடைய செய்தி