జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్కు ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను జనవరి 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల కానున్నారు.