ఎన్నికల తనిఖీల్లో ఏపీలో రూ.107.96 కోట్లు పట్టుకున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. అక్రమ నగదు తరలిస్తున్న 7,305 మందిని అరెస్టు చేశారు.రూ. 58.70 కోట్ల విలువైన అక్రమ మద్యం పట్టుకున్నారు. అక్రమ మద్యం కేసుల్లో 61,543 మందిని అరెస్టు చేశారు. రూ. 35.61 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసున్నారు.