వరదల్లో చిక్కుకుపోయిన ఏపీ ఎమ్మెల్యే

1028பார்த்தது
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహబూబాబాద్ లో చిక్కుకుపోయారు. నెల్లూరు నుంచి సికింద్రాబాద్ కు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కేసముద్రం, నెక్కొండ మధ్యలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్న విష‌యం తెలిసిందే. మహబూబాబాద్‌లో మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ నిలిపివేయడంతో ఎమ్మెల్యే అక్కడే చిక్కుకుపోయారు. వెంటనే ఆయన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమాచారం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி