శబరిమల ప్రసాదంలో కల్తీ.. మోతాదుకు మించి క్రిమి సంహారకాలు

64பார்த்தது
శబరిమల ప్రసాదంలో కల్తీ.. మోతాదుకు మించి క్రిమి సంహారకాలు
శబరిమల ప్రసాదమైన ‘అరవణ’లో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమి సంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ ‘అరవణ’ను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలోని 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం గత ఏడాదిగా వాడకుండా ఉంది. ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమిసంహారకాలు కలిసినట్టు వచ్చిన ఆరోపణల వల్లే వీటి వాడకాన్ని నిలిపివేశారు.

தொடர்புடைய செய்தி