దేశీదారు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

583பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలోని శుభాష్ చంద్ర బోష్ కాలనీ, విజయ్ బస్తీలో శుక్రవారం రాత్రి టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్, ఎస్ఐ వెంకటేష్ లు తమ సిబ్బందితో కలిసి నిషేధిత దేశీదారు మద్యంను పట్టుకోవడం జరిగింది. సీఐ వివరాల ప్రకారం. రతన్ గుప్తా ఇంటిని తణిఖీ చేయగా రూ. 20, 300 విలువ గల మద్యంను పట్టుకున్నామని తెలిపారు. అతనిని అదుపులోకి తీసుకుని కాగజ్‌నగర్‌ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

தொடர்புடைய செய்தி