సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటు

64பார்த்தது
ఎస్ఎఫ్ఐ పూర్వ జాతీయ అద్యక్షులు సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటు అని సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహణ కమిటీ నాయకులు అన్నారు. ఆదివారం కాగజ్‌నగర్‌ లో ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, సామాజిక తరగతుల హక్కులకై అలుపెరగని ఉద్యమాలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, ఎస్ ఎస్ఐ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி