కిరాణ దుకాణంలో చోరి.. కేసు నమోదు

64பார்த்தது
కిరాణ దుకాణంలో చోరి.. కేసు నమోదు
భైంసా మండలం మహాగాం గ్రామంలోని కిరాణ దుకాణంలో చోరి జరిగినట్లు శనివారం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం గ్రామంలోని శంకర్ కు చెందిన కిరాణ దుకాణానికి ఈ నెల 15న తాళం వేసి వెళ్లి మరుసటి రోజు వచ్చి చూడగా దుకాణం వెనకాల నుండి దొంగలు చొరబడి 3, 000 రూ. విలువ గల సరుకులు, రూ. 4, 700 నగదు ఎత్తుకుపోయినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி