వేధించిన కేసులో వ్యక్తికి రెండు నెలల జైలు

65பார்த்தது
వేధించిన కేసులో వ్యక్తికి రెండు నెలల జైలు
కడెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళను వేధింపులకు గురిచేసిన కేసులో ఒకరికి రెండు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం ఖానాపూర్ న్యాయమూర్తి జితిన్ కుమార్ తీర్పు వెల్లడించినట్లు ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు. 2015లో నమోదైన ఈ కేసు విచారణ అనంతరం గణేష్ అనే నిందితునికి రెండు నెలల జైలు శిక్ష, రూ. రెండు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్టు ఎస్ఐ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி