బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చైల్డ్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు రామకృష్ణ అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని పలు దుకాణాలు, హోటల్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0–18 ఏళ్ల బాల బాలికలంతా బడిలోనే ఉండాలని, వారిని తమ దుకాణాల్లో పనులు చేయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.