గీతానికి మద్దతు, తుది దశలో చిహ్నం: సీఎం రేవంత్

11757பார்த்தது
గీతానికి మద్దతు, తుది దశలో చిహ్నం: సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయ పార్టీల నేతలు అంగీకారం తెలిపినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. సచివాలయంలో సీపీఐ, సీపీఎం, జనసమితి సహా ముఖ్యనేతలతో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అందెశ్రీ రాసిన పాటను కీరవాణి నేతృత్వంలో సింగర్స్ పాడి వినిపించారు. ఈ గేయాన్ని 2.30 సెకన్ల నిడివితో రూపొందించారు. జూన్ 2న సీఎం పాటను ఆవిష్కరించనున్నారు. చిహ్నం కూడా తుది రూపు దిద్దుకుంటోందని, మరో సమావేశంలో చిహ్నాన్ని ఖరారు చేస్తామని వివరించారు.

தொடர்புடைய செய்தி