అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు. మరో వ్యక్తి చెన్నైవాసి అని తెలిసింది. రోడ్డుపై వెళ్తున్న 5 వాహనాలు ఒకేసారి ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్కు చెందిన మృతుల పేర్లు రఘునాథ్, లోకేష్, ఫరూక్ షేక్, కాగా చెన్నై వాసి పేరు దర్శిని వాసుదేవన్ అని నిర్ధారణ అయ్యింది. మృతుల్లో ఒకరు కుకట్పల్లి వాసి ఉన్నట్టు సమాచారం.