మిషన్‌ కాకతీయ పనులను పరిశీలించిన చైర్‌పర్సన్‌ అనితనాగరాజు

191பார்த்தது
మిషన్‌ కాకతీయ పనులను పరిశీలించిన చైర్‌పర్సన్‌ అనితనాగరాజు
కోదాడ : పట్టణంలోని పెద్ద చెరువులో జరుగుతున్న మిషన్‌ కాకతీయ పనులను కోదాడ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వంటిపులి అనిత మంగళవారం పరిశీలించారు. ఈ సంరద్భముగా ఆమె మాట్లాడుతూ మిసన్‌ కాకతీయ ద్వారా పెద్ద చెరువులో చేపట్టిన పనులతో కోదాడకు భూగర్భ జలాలు పెరిగి నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. వర్షకాలం వస్తున్నందున వేగంగా పనులు పూర్తి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎంబిసి అద్యక్షుడు వంటిపులి నాగరాజు, కౌన్సిలర్లు ఖాజాగౌడ్‌, కాంపాటి శ్రీనివాసరావు, గోవిందరావు, ఉపేందర్‌, రాజు, శ్రీను తదితరులు పాల్గొనానరు.

டேக்ஸ் :