నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కోటంరెడ్డి

85பார்த்தது
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద సోమవారం గణేష్ ఘాట్ వద్ద 11వ తేదీ జరిగే నిమజ్జనా కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో చర్చించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11వ తేదీ జరిగే గంగా హారతి, మహిళా శోభాయాత్ర అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు.

தொடர்புடைய செய்தி