ప్రతి గ్రామానికి ఉచిత ఆరోగ్య సేవలు అందించాలన్న లక్ష్యం సాధనకై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం చల్లాయపాలెం గ్రామంలో కొత్తగా నిర్మించిన విలేజ్ హెల్త్ క్లీనిక్ ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.