మూడు రోజులుగా దొరకని విద్యార్థి ఆచూకీ

54பார்த்தது
మూడు రోజులుగా దొరకని విద్యార్థి ఆచూకీ
ప్రకాశం జిల్లా, మార్కాపురం పట్టణానికి చెందిన ఎంబిబిఎస్ విద్యార్థి హరిదీప్ మృతదేహం కోసం గత మూడు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మారేడుమల్లి జలపాతంలో స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు వెళ్లిన హరిదీప్ నీటిలో గల్లంతయ్యాడు. ఆదివారం హరిదీప్ గల్లంతు కాగా గత మూడు రోజుల నుంచి మృతదేహం కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ విద్యార్థి ఆచూకీ లభించలేదని మంగళవారం తెలిపారు.

தொடர்புடைய செய்தி